యాప్నగరం

వైఎస్సార్ కాంగ్రెస్ నేడు, కాంగ్రెస్ రేపు

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి

TNN 4 Aug 2017, 1:09 pm
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానగణంతో భారీ ర్యాలీగా వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేశారు. నంద్యాల ఆర్డీవో ఆఫీసులో శిల్ప నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అనుచరులు, పార్టీ నేతలు ఉన్నారు. మోహన్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Samayam Telugu nominations in nandyal
వైఎస్సార్ కాంగ్రెస్ నేడు, కాంగ్రెస్ రేపు


ఇక తమ పార్టీ అభ్యర్థి రేపు నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ తరపున అబ్దుల్ ఖాదర్ పోటీ చేస్తారని, ఐదో తేదీన ఆయన నామినేషన్ ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. ఖాదర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు వస్తారని ఆయన ప్రకటించారు.

ఇక అధికార పార్టీ తరపున భూమాబ్రహ్మానంద రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యం అయిన ఈ ఉప ఎన్నికలో, భూమా అన్న కుమారుడు అయిన బ్రహ్మానంద రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. మంత్రి అఖిలప్రియ, భూమా చిన్న కూతురు మౌనిక, కొడుకు విఖ్యాత్ లు బ్రహ్మానంద రెడ్డి వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.