యాప్నగరం

మీరు పార్టీలో చేరితే టికెట్ త్యాగం చేస్తా: నోముల

‘మీరు గతంలో ఓ మాటిచ్చారు, దాని మీద నిలబడాలి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలి. మీరు పార్టీలో చేరితే నా టికెట్ త్యాగం చేస్తా’నని నోముల తెలిపారు.

Samayam Telugu 9 Sep 2018, 6:29 pm
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే ఆయన కోసం టికెట్ త్యాగం చేస్తానని టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్న ఆయన ఈ విషయమై గతంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ను సామాజిక ఇంజినీర్‌గా అభివర్ణించారు.
Samayam Telugu jana reddy2


విపక్షాలు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని నోముల తెలిపారు. నల్గొండ జిల్లాలోని 12 సీట్లనూ టీఆర్ఎస్ అధిక మెజార్టీతో కైవసం చేసుకుంటుందని నోముల తె. కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి ఓటమికి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని నోముల గుర్తు చేశారు. నాగార్జున సాగర్ ప్రజలు ఆయన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన నోముల.. వారానికి రెండుసార్లు నియోజకవర్గానికి వచ్చినా.. జనం ఆయన్ను ఓడిస్తారని నోముల తెలిపారు.

‘వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి అసెంబ్లీలో అన్నారు. జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఈరోజు ఆ పని చేయాలని డిమాండ్‌ చేస్తున్నా'నని హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యలను జానారెడ్డి ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.