యాప్నగరం

హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది నేనే: పాల్

చంద్రబాబు నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన పాల్.

Samayam Telugu 6 Dec 2018, 8:33 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, గత నాలుగున్నర ఏళ్లలో దాదాపు ఏడుసార్లు కుట్రలు చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.
Samayam Telugu naidu-1524212451


‘‘ఏపీలో జరుగుతున్న రాక్షస పాలనను అంతం చేయడానికి నేను అన్ని పార్టీల సహకారంతో రాష్ట్రపతిని కలవబోతున్నా. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని రాష్ట్రపతిని కోరతాం. అసలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేను. చంద్రబాబు నాయుడు కాదు, ఆయన సీఎం కావడానికే ముందే నేను అభివృద్ధి చేశా’’ అని పాల్ తెలిపారు.
Read also: పవన్ కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ: కేఏ కేపాల్
ఏపీలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదం, ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదం, లాల్ జాన్ బాషా మరణం తదితర అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నానని తెలిపారు. డిసెంబరులో పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో తలపెట్టిన రెండు రోజుల బహిరంగ సభలకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని, తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాలంటూ ఆటంకాలు సృష్టిస్తున్నారని పాల్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.