యాప్నగరం

జనసేనలో చేరికపై స్పందించిన మోత్కుపల్లి

తన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి. హైదరాబాద్‌లోని తన నివాసంలో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.

Samayam Telugu 5 Aug 2018, 4:06 pm
తన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి. హైదరాబాద్‌లోని తన నివాసంలో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తాను ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు నర్సింహులు. తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరతానని.. అలా చేరని పక్షంలో తనను 6సార్లు గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానంటున్నారు. జనసేనలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. తన లక్ష్యాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మోత్కుపల్లి.
Samayam Telugu Motkupalli


చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ కోసం పవన్, జగన్‌లను త్వరలోనే కలుస్తానంటున్నారు నర్సింహులు. ఓ మిత్రుడిగా వారికి సాయం చేయాలనుకుంటున్నానని.. తన అభిప్రాయాన్ని నేతలతో పాటూ ప్రజలకు చెబుతానంటున్నారు. టీడీపీ ఇబ్బందులో ఉన్న సమయంలో తాను అండగా నిలబడ్డానని.. కాని చంద్రబాబు మాత్రం తన గొంతు కోసి పార్టీ నుంచి వెళ్లగొట్టాడని ఆరోపించారు. బాబును ఓడించడానికి చివరి వరకు పోరాటం చేస్తానన్నారు నర్సింహులు.

కాపు రిజర్వేషన్ల అంశంపై కూడా మోత్కుపల్లి స్పందించారు. కాపుల్ని వాడుకొని వదిలేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు నర్సింహులు. ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని వ్యక్తి.. కాపులకు ఏం ఒరగబెడతారని మండిపడ్డారు. అసలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల్ని మోసం చేశారని.. ఇప్పుడు కాపుల్ని కూడా అలాగే చేస్తారని విమర్శించారు. బాబు ఏం చేసినా ఓట్లు, సీట్లు కోసమే చేస్తారని.. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కనుమరుగు కావడంతో ఖాయమన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.