యాప్నగరం

కొత్త పార్టీకే లక్ష్మీనారాయణ మొగ్గు.. త్వరలో జెండా, ఎజెండా

లోక్‌సత్తా ఆహ్వానాన్ని తిరస్కరించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. సొంత పార్టీవైపే మొగ్గు.. త్వరలోనే పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తానన్న లక్ష్మీనారాయణ.

Samayam Telugu 28 Nov 2018, 8:40 pm
పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెరదించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. లోక్‌సత్తాలో చేరకుండా.. సొంత పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 26న నిర్వహించిన కార్యకర్తల సమావేశం నిర్వహించామని.. వారి సూచన మేరకు తన రాజకీయ రంగ ప్రవేశం సొంత పార్టీ ద్వారానే జరుగుతుందన్నారు. పార్టీ పేరు, విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేశారు.
Samayam Telugu Jd Lakshmi Narayana


లక్ష్మీనారాయణ సోమవారం (26-11-2018)న హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తన రాజకీయ రంగం ప్రవేశంపై వారితో చర్చించారు. అలాగే లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాలని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించడంతో డైలమాలో పడ్డారు. దీనిపై కూడా కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానన్న సీబీఐ మాజీ జేడీ.. వారి సూచన మేరకు చివరికి సొంత పార్టీవైపే మొగ్గు చూపారు.

జేడీ సొంత పార్టీ వైపే మొగ్గు చూపడం ఆసక్తిగా మారింది. ఆయన పార్టీ పేరు, జెండా, ఎజెండా ఎలా ఉండబోతుందనే చర్చ మొదలయ్యింది. జనధ్వని పేరుతో పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. మరి లక్ష్మీనారాయణ అదే పేరుకు మొగ్గు చూపుతారో.. మరో కొత్త పేరుతో ముందుకొస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.