యాప్నగరం

జగన్ పిలుపుతో పేదల ఇళ్లకు రూ.4 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన ఎన్నారై!

పేదల ఇళ్ల కోసం కోట్లాది రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ఓ ఎన్నారై మహిళ ముందుకొచ్చారు. పెనుమంట్ర మండలంలోని గర్వు గ్రామానికి చెందిన ప్రవాసీ మహిళ పడాల కస్తూరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 16 Jun 2019, 12:19 pm
పేదల ఇళ్ల కోసం కోట్లాది రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ఓ ఎన్నారై మహిళ ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని గర్వు గ్రామానికి చెందిన ప్రవాసీ మహిళ పడాల కస్తూరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కస్తూరి తన 1.10 ఎకరాల భూమిని విరాళంగా అందజేస్తున్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రోద్బలంతో ఈ భూమిని అందించాలని ఆమె నిర్ణయించారు. లండన్‌ నుంచి వచ్చిన కస్తూరిని మంత్రి అభినందించారు. కాగా, శనివారం ఆచంటలోని మంత్రి శ్రీరంనాథరాజును పలు పార్టీల నేతలు కలిసి వినతిప్రతాలను అందజేశారు.
Samayam Telugu penumatra


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని, ఇందు కోసం భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. అర్హులైనవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, గృహానిర్మాణంలో అవకతవకలు జరక్కుండా చూస్తామని అన్నారు. ఆచంటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని, నవరత్నాల అమలుకు శాయశక్తులా కృషిచేస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.