యాప్నగరం

జగన్ ప్రకటనను స్వాగతించిన ఆమె, టీడీపీ ఫైర్

తమకు అధికారం వస్తే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రకటనను ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి స్వాగతించారు

Samayam Telugu 30 Apr 2018, 6:18 pm
తమకు అధికారం వస్తే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రకటనను ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి స్వాగతించారు. జగన్ ప్రకటన తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ వేదికగా జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వంచన వ్యతిరేక దీక్ష’లో పాల్గొన్న ఆమె జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్టీఆర్‌కు అల్లుడు, తనయులు ఇవ్వని గౌరవాన్ని జగన్ ఇస్తానని అంటున్నారని, అంతకన్నా తనకు ఆనందం ఏముందని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ హామీని తను స్వాగతిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
Samayam Telugu jagan_1900


ఇక ఈ ప్రకటన పట్ల తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ధర్మపోరాటం’ నుంచి జనాలను డైవర్ట్ చేయడానికే జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేశారని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను కేవలం ఒక జిల్లాకు పరిమితం చేయడమా? అంటూ వారు విరుచుకుపడ్డారు. మరి కొందరు నేతలు స్పందిస్తూ ఎన్టీఆర్ పేరును ఎత్తే అర్హత జగన్ కు లేదు అని వ్యాఖ్యానించారు.

ఇంకొందరు తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకు వేస్తూ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే ప్రతిపాదన తమ దగ్గర ఉందని అన్నారు. ఈ విధంగా నిమ్మకూరులో జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.