యాప్నగరం

హరికృష్ణ నివాసానికి శాలిని, లక్ష్మీ ప్రణతి

హరికృష్ణను కడసారి చూడటానికి ఆయన నివాసానికి భార్య శాలిని వచ్చారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆమెను వెంటబెట్టుకొని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి వారు బోరుమన్నారు.

Samayam Telugu 29 Aug 2018, 4:52 pm
రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను కడసారి చూడటానికి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu shalini2


హరికృష్ణను కడసారి చూడటానికి ఆయన నివాసానికి భార్య శాలిని వచ్చారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆమెను వెంటబెట్టుకొని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ మరణవార్త విని శాలిని షాక్‌కు గురయ్యారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి బోరుమన్నారు. హరికృష్ణ సోదరి పురంధేశ్వరి, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు.

ప్రణతితో శాలిని


గవర్నర్ నివాళి..
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు నివాళి అర్పించారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు హరికృష్ణ కుటుంబసభ్యులను ఓదార్చారు. హరికృష్ణలేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

నల్గొండలోని అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. హరికృష్ణ పార్థివదేహం వెంట ఆయన కుమారులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, సోదరుడు బాలకృష్ణ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హరికృష్ణ భౌతికకాయం తరలించిన వాహనం వెంటే వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.