యాప్నగరం

Guntur Murder: వీడియో - మాచర్ల దారుణం.. నడిరోడ్డుపై నరికివేత

గుంటూరు జిల్లా మాచర్లలో హైదరాబాద్ అత్తాపూర్ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు వేటాడి, వెంటాడి హత్య చేశారు.

Samayam Telugu 2 Oct 2018, 7:30 am
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. బాధితుడు ప్రాణ భయంతో పరుగు తీయగా అతణ్ని వెంబడించి, వేటాడి హతమార్చారు. నడిరోడ్డుపై కత్తులతో వేటాడి వ్యక్తిని నరికి చంపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది.
Samayam Telugu murder


మాచర్ల మార్కెట్ యార్డు వద్ద ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపారు. రేపల్లెకు చెందిన ప్రేమ్ కుమార్ టీచర్‌గా పనిచేస్తున్న తన భార్యను కలవడానికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం (అక్టోబర్ 1) మధ్యాహ్నం తన భార్యను కలవడానికి బయలుదేరిన ప్రేమ్ కుమార్.. ఓ చోట బైక్‌ను రోడ్డు పక్కన ఆపి పక్కనే ఉన్న కొట్టు దగ్గరకు వెళ్లాడు. కారులో వెంబడించిన కొంత మంది ప్రేమ్ కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేశారు.

భయంతో పరుగు తీసిన ప్రేమ్ కుమార్‌ను దుండగులు వెంటాడి పట్టుకున్నారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. తీవ్ర గాయాల పాలైన ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..

పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్ కుమార్‌ను వెంటాడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.