యాప్నగరం

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. చక్రాల కింద నలిగి పాప మృతి

ఏడాదిన్నర వయసున్న ఓ పసి మొగ్గను స్కూల్ బస్సు చిదిమేసింది. అన్నయ్యను బడికి పంపడానికి తండ్రితో కలిసి బయటకొచ్చిన పాప.. అన్న ఎక్కిన బస్సు చక్రాల కిందే నలిగి ప్రాణాలు వదిలింది.

Samayam Telugu 25 Jun 2018, 11:51 am
ఏడాదిన్నర వయసున్న ఓ పసి మొగ్గను స్కూల్ బస్సు చిదిమేసింది. అన్నయ్యను బడికి పంపడానికి తండ్రితో కలిసి బయటకొచ్చిన పాప.. అన్న ఎక్కిన బస్సు చక్రాల కిందే నలిగి ప్రాణాలు వదిలింది. హృదయ విదారకమైన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గోపిగడ్డ గ్రామానికి చెందిన శంకర్ రెడ్డికి ఐదేళ్ల కుమారుడు, ఏడాదిన్నర వయసున్న పాప ఉంది.
Samayam Telugu school-bus


స్కూల్‌ బస్సు ఇంటి ముందు ఆగగా.. శంకర్ రెడ్డి కుమారుణ్ని బస్సు ఎక్కించాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన చిన్నారి ఆద్య.. స్కూల్ బస్సు ముందు ఉండిపోయింది. పాపను గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చక్రాల కింద నలిగి పాప ప్రాణాలు వదిలింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్ల ముందే చనిపోవడం చూసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. అప్పటి వరకూ ఆడుతూ అల్లరి చేసిన చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

పాప చనిపోవడానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు పాప కనిపించకపోవడం వల్లే బస్సును ముందుకు పోనిచ్చానని డ్రైవర్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.