యాప్నగరం

ఆటోను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

Samayam Telugu 8 Dec 2018, 3:33 pm
అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండల పరిధిలోని రామ్‌దాస్‌పేట గ్రామ సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం వెంగన్నపల్లికి చెందిన కొందరు గార్లదిన్నెలోని కనంపల్లి నల్లమ్మ దేవాలయంలో భజన కార్యక్రమానికి శుక్రవారం రాత్రి హాజరయ్యారు. భజన ముగిసిన తర్వాత ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో రామ్‌దాస్‌‌పేట వద్ద ఆటోను నిలిపి ఉంచగా వెనక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. దీంతో ఆటో వెనక వైపు కూర్చున్న సూరమ్మ (60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
Samayam Telugu accident


ఈ ఘటనలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.