యాప్నగరం

యువతి ప్రాణం తీసిన సెల్ ఫోన్

ఆ అమ్మాయి బీటెక్ పూర్తిచేసింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం కూడా సంపాదించింది.

TNN 19 Jun 2017, 9:31 am
ఆ అమ్మాయి బీటెక్ పూర్తిచేసింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం కూడా సంపాదించింది. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. ఉద్యోగం వచ్చినందుకు ఫ్రెండ్స్ ఫోన్‌లో అభినందనలు చెబుతుంటే.. ఆ సంతోషంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయింది. తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మరణించింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu ongole girl falls from fifth floor of building while using mobile dies
యువతి ప్రాణం తీసిన సెల్ ఫోన్


ఒంగోలులోని భాగ్యనగర్ కాలనీకి చెందిన త్రిపుర బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగం రావడంతో సోమవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఆదివారం రాత్రి పిండి వంటలు వండారు. ఈ వంటల కార్యక్రమం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. ఈ సమయంలో త్రిపురకు ఆమె స్నేహితులు ఫోన్‌చేసి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇంట్లో సిగ్నల్ సరిగా రావడంలేదని ఫ్లాట్ బయటికి వచ్చి పిట్టగోడపై కూర్చొని ఫోన్ మాట్లాడుతోంది. ఈ సమయంలో పట్టుతప్పి కిందకి పడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయింది.

హైదరాబాద్ వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుందనుకున్న కూతురు కళ్ల ముందే విగతజీవిలా పడిఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.