యాప్నగరం

సింహం సింగిల్ గానే వస్తుంది: అమిత్ షా

తుఫాను వచ్చినప్పుడు వైరం మరిచి ప్రాణాలు కాపాడుకునేందుకు పాములు, ముంగీసలు, కక్కలు, పిల్లులు చివరకు పులులు, సింహాలు కూడా కలిసి చెట్లు ఎక్కినట్లే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సిద్ధాంత విభేదాలు పక్కన పెట్టి జట్లు కడుతున్నారని అన్నారు. మోడీ హోరులో తుడిచి పెట్టుకుపోతామన్న భయంలో జంతువులు జట్లు కట్టినట్లు జట్లు కడుతున్నారని ధ్వజమెత్తారు.

Samayam Telugu 6 Apr 2018, 5:50 pm
పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది అంటూ ఓ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ తరహాలో ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పంచ్‌లు విసిరారు. చివరకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ గణవిజయం సాధించడంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు ప్రారంభమైందని అన్నారు. ఒక్కోరాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంటూ పోతుండడంతో అభద్రతాభావంలో పడిపోయిన ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు ఒక్కటవుతున్నాయని అన్నారు. సిద్ధాంత బేధాలు పక్కన పెట్టి జట్టు కట్టేందుకు సిద్ధం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎనాడు చేతులు కలపని పార్టీలు ఇప్పుడు రాసుకు పూసుకు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
Samayam Telugu opposition is ganging up against us amith sha
సింహం సింగిల్ గానే వస్తుంది: అమిత్ షా

తుఫాను వచ్చినప్పుడు వైరం మరిచి ప్రాణాలు కాపాడుకునేందుకు పాములు, ముంగీసలు, కక్కలు, పిల్లులు చివరకు పులులు, సింహాలు కూడా కలిసి చెట్లు ఎక్కినట్లే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సిద్ధాంత విభేదాలు పక్కన పెట్టి జట్లు కడుతున్నారని అన్నారు. మోడీ హోరులో తుడిచి పెట్టుకుపోతామన్న భయంలో జంతువులు జట్లు కట్టినట్లు జట్లు కడుతున్నారని ధ్వజమెత్తారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.