యాప్నగరం

సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్!

సమావేశాలు మొదలైన రెండో రోజే ప్రతిపక్ష సభ్యుల నుంచి ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనలు ప్రతిపక్షం వాకౌట్ చేసేవరకు...

Samayam Telugu 7 Mar 2017, 10:40 am
కొత్త అసెంబ్లీలో సమావేశాలు మొదలైన రెండో రోజే ప్రతిపక్ష సభ్యుల నుంచి ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనలు ప్రతిపక్షం వాకౌట్ చేసేవరకు వెళ్లాయి. ఓవైపు ప్రశ్నోత్తరాలు జరుగుతుండగానే, మరోవైపు ప్రభుత్వం తరపున మంత్రులు ఇస్తున్న వివరణలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకి 50 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఉచిత విద్యుత్ పథకం కింద వారికిచ్చే ఉచిత విద్యుత్ సరఫరా కోసం కేటాయిస్తున్న నిధులు మాత్రం ఎస్సీ, ఎస్టీలకి ముష్టివేసినట్టుగానే వున్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు.
Samayam Telugu opposition party ysrcp walks out from ap assembly
సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్!


ఎస్సీలకి రూ.58 కోట్లు, ఎస్టీలకి రూ.18.5 కోట్లు మాత్రమే మంజూరు చేస్తూ దానిని సైతం ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం ఏంటని జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని నిరుపేద కుటుంబాలకి, ఇంత చిన్న ఆర్థిక సహాయం చేసి అన్ని గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగన్. గతంలో నెలకి రూ.150 విద్యుత్ బిల్లు వస్తే, ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకా రూ.500 వరకు వస్తోందని ఆరోపించిన జగన్.. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా తమ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో కలిసి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.