అనాథ పిల్లలకు షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను వర్తింపజేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అనాథ ఆశ్రమాల్లో పిల్లలు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గురువారం అసెంబ్లీలో ఫీజు రియింబర్స్ మెంట్ పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం అనాథ పిల్లల చదువులపై సీఎం కేసీఆర్ స్పందించారు.
‘‘రాష్ట్రంలోని అనాథ పిల్లలకు నూటికి నూరు శాతం ప్రభుత్వమే తల్లీతండ్రీ! వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీ హోదా కల్పిస్తాం. ఎస్సీల రిజర్వేషన్ కోటాను తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తామని’’ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనాథ పిల్లలకు ఏ కులం, ఏ మతం హోదా కల్పించినా తక్కువేనని అన్నారు.
కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో అనాథ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఫీజులపై ఒక్క విద్యార్థి కూడా రంధి పడాల్సిన అవసరం లేదని, 2015–16 సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఈ ఏడాది మార్చి 31లోగా 100 శాతం చెల్లిస్తామని హామీనిచ్చారు.
‘‘రాష్ట్రంలోని అనాథ పిల్లలకు నూటికి నూరు శాతం ప్రభుత్వమే తల్లీతండ్రీ! వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీ హోదా కల్పిస్తాం. ఎస్సీల రిజర్వేషన్ కోటాను తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తామని’’ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనాథ పిల్లలకు ఏ కులం, ఏ మతం హోదా కల్పించినా తక్కువేనని అన్నారు.
కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో అనాథ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఫీజులపై ఒక్క విద్యార్థి కూడా రంధి పడాల్సిన అవసరం లేదని, 2015–16 సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఈ ఏడాది మార్చి 31లోగా 100 శాతం చెల్లిస్తామని హామీనిచ్చారు.