యాప్నగరం

ఓయూలో ఉద్యమాలు బంద్, ఉత్తర్వులు జారీ

ఉద్యమాల ఖిల్లా...పోరాటాల గడ్డ.... వందేమాతరం ఉద్యమం నుంచి తెలంగాణ తొలిదశ, మలిదశ

Samayam Telugu 9 Jun 2017, 10:46 am
ఉద్యమాల ఖిల్లా...పోరాటాల గడ్డ.... వందేమాతరం ఉద్యమం నుంచి తెలంగాణ తొలిదశ, మలిదశ పోరాటాల దాకా అనేక ఉద్యమాలు, ఆందోళనలకు కేంద్రబిందువుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇకపై రాజకీయ సభలు, విద్యాయేరత బహిరంగ సభలు జరగడానికి వీల్లేదని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu ou vc orders no political public meetings in campus
ఓయూలో ఉద్యమాలు బంద్, ఉత్తర్వులు జారీ


‘ఓయూ దేశంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. వివిధ రంగాల్లో పరిశోధనలు చేయడానికి, ఉన్నత విద్యను అందించడానికి దీన్ని ప్రారంభించారు. వర్సిటీ లక్ష్యం పూర్తిగా విద్య, పరిశోధనలే. విద్య, పరిశోధనలకు సంబంధం లేని రాజకీయ, ఇతరత్రా బహిరంగసభలను వర్సిటీ ప్రాంగణంలో అనుమతించేది లేదు’ అని వీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే వీసీ ఆదేశాలపై వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడెందుకు అంటూ నిలదీస్తున్నారు. తెలంగాణ సాధించేంత వరకు ఉద్యమాలు కొనసాగించిన ఘనత తమదేనని అంటున్నారు.

బహిరంగ సభలను నిషేదిస్తూ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఓయూ విద్యార్థుల త్యాగాలతోనే కేసీఆర్ అధికారం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. వీసీ జారీ చేసిన నిషేదాజ్ఞలు వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.