యాప్నగరం

‘ఎమ్మెల్యేలు దొంగలు, ప్లాట్లు అమ్ముకుంటారు’

ఎమ్మెల్యేలు దొంగలు... ప్రభుత్వం నుంచి ప్లాట్లు కేటాయిస్తే వాటిని అమ్ముకుంటారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Samayam Telugu 16 Apr 2017, 1:53 pm
ఎమ్మెల్యేలు దొంగలు... ప్రభుత్వం నుంచి ప్లాట్లు కేటాయిస్తే వాటిని అమ్ముకుంటారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని అమరావతి నిర్మాణంపై పెద్దగా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలులో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జేసీ ఆయనతో ‘ మంత్రిగారూ, మీకు మీ సీఎంకి అమరావతిపై ఏమాత్రం అవగాహన లేదు’ అని అన్నారు.
Samayam Telugu our mlas are thieves they sell plots tdp mp jc diwakar reddy
‘ఎమ్మెల్యేలు దొంగలు, ప్లాట్లు అమ్ముకుంటారు’


‘అమరావతిలో ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు కేటాయించాలి. అయితే మన ఎమ్మెల్యేలు దొంగలు. ఇచ్చిన ప్లాట్లను అమ్ముకుంటారు. వాటిని అమ్ముకోకుండా చూడాలి’ అని మంత్రి నారాయణతో అన్నారు.

నారాయణ నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని నిలదీశారు. దీంతో నారాయణ కల్పించుకొని.. సార్, నేను కొంతకాలం అందుబాటులో లేను. ఇప్పుడు సమస్యలపై దృష్టి సారిస్తా’ అని వివరణ ఇచ్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.