తన కుటుంబం కంటే పార్టీ కార్యకర్తలే ముఖ్యం అని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీకి బలం కార్యకర్తలేనని ఆయన గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్-నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో టీడీపీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని చెప్పిన చంద్రబాబు... తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని బాబు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని చెప్పిన చంద్రబాబు... తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని బాబు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు పాల్గొన్నారు.