యాప్నగరం

మంత్రి దత్తత గ్రామంలో రోడ్డుపైనే వరినాట్లు

తెలంగాణ రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి దత్తత గ్రామ ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా

Samayam Telugu 1 Jul 2017, 12:13 pm
తెలంగాణ రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి దత్తత గ్రామ ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో సీసీరోడ్లు లేకపోవడంతో స్థానికులు బురదగా ఉన్న రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో కూడా రహదారులు బురదమయం కావడంతో రోడ్లపైనే వరినాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు.
Samayam Telugu paddy saplings on road at villages in telangana
మంత్రి దత్తత గ్రామంలో రోడ్డుపైనే వరినాట్లు


ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గ్రామాల్లో రహదారులు బురదమయమై.. గుంటలను తలపిస్తున్నాయి. స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులను పక్కాగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.