యాప్నగరం

మంత్రి పదవి పోయినా... పల్లె హ్యాపీనేనట

ఏపీ మంత్రి వర్గంలో అనేక మార్పులు చేర్పులు చేశారు సీఎం చంద్రబాబునాయుడు.

TNN 3 Apr 2017, 2:14 pm
ఏపీ మంత్రి వర్గంలో అనేక మార్పులు చేర్పులు చేశారు సీఎం చంద్రబాబునాయుడు. 11 మంది కొత్తవాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించి, అయిదుగురు పాతవాళ్లని తొలగించారు. తొలగించిన మంత్రుల జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కూడా ఉన్నారు. మంత్రి పదవి పోయినా కూడా పల్లె ముఖం ముడుచుకోకుండా హ్యాపీహ్యాపీగానే తిరుగుతున్నారు. ఆయనలా కనిపించడం కొందరు పార్టీ నేతలకు విస్మయం కనిపిస్తోంది. కాగా పల్లె రఘునాథరెడ్డి తన ఖుషీ వెనుక కారణాన్ని చెప్పారు.
Samayam Telugu palle raghunatha reddy says has no dissindent on ministry removal
మంత్రి పదవి పోయినా... పల్లె హ్యాపీనేనట


చంద్రబాబు తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ తనకెలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. చంద్రబాబుకు తనపై ప్రేమ, గౌరవం ఉన్నాయని అన్నారు. తనను పిలిచి అరగంటపాటూ మాట్లాడారని చెప్పారు. తనకు అప్పజెప్పిన శాఖలోను, పనుల్లోనూ ఎలాంటి మచ్చలేకుండా పనిచేశానని చెప్పుకున్నారు. అందుకే చంద్రబాబు తనను మంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ మరో పదవీ అవకాశం ఇస్తానని మాటిచ్చారని ఆయన తెలిపారు.

మంత్రి పదవితో సమానమైన హోదా ఉన్న చీఫ్ విప్ పదవిని తనకు ఇవ్వనున్నట్టు చంద్రబాబు మాటిచ్చారని ఆయన తెలిపారు. పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా, జిల్లా అభివృద్ధి కోసం అందరి నేతలను కలుపుకునిపోతానని ఆయన చెప్పారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి పనితీరు కారణం కాదని, కేవలం అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలన్న కారణంగానే తప్పించినట్టు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.