యాప్నగరం

పరేడ్ గ్రౌండ్ ఎక్కడికి పోదు కానీ పక్కనే ఉన్న..

పరేడ్ గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మిస్తారని వస్తున్న వార్తలను తెలంగాణ సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు

Samayam Telugu 24 May 2017, 6:40 pm
పరేడ్ గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మిస్తారని వస్తున్న వార్తలను తెలంగాణ సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. జింఖాన గ్రౌండ్, స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్న స్థలంతో పాటు బైసన్ ఫోలో గ్రౌండ్ లో సచివాలయం, శాసనసభ, శానసమండలి, తెలంగాణ కళా భారతీలను నిర్మించబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 50-54 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన బుధవారం వెల్లడించారు.
Samayam Telugu parade ground remains parade ground says kcr
పరేడ్ గ్రౌండ్ ఎక్కడికి పోదు కానీ పక్కనే ఉన్న..


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం రాష్ట్రానికి పరేడ్ గ్రౌండ్ లేకుండా పోయిందని, ప్రతి విషయానికి ఢిల్లీ కాళ్లు మొక్కి, పరేడ్లు చేశాం అన్నట్లుగా అప్పటి పాలకులు ఉన్నారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కూడా పరేడ్ గ్రౌండ్ లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నామని కేసీఆర్ తెలిపారు. టిఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారంపై స్పందించిన కేసీఆర్..‘ఇదో మిలీనియం జోక్’ అన్నారు.
మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోవని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.