యాప్నగరం

చనిపోయాక కూడా చికిత్స చేస్తున్నారంటూ...

బతికున్న కొడుకునే చనిపోయాడనుకుని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిపోయారు తల్లిదండ్రులు.

TNN 31 Mar 2017, 8:31 am
తమ కొడుకు చనిపోయినా కూడా డబ్బుల కోసం వైద్యం చేస్తున్నట్టు నటిస్తున్నారంటూ కొందరు ఆసుపత్రిపై దాడి చేశారు. వైద్యులు బాలుడు బతికే ఉన్నాడని చెబుతున్నా కూడా వినకుండా అతడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని లోటస్ ఆసుపత్రిలో జరిగింది. మార్చి 27న లక్డీకాపూల్ లో ఉన్న లోటస్ లో సురేష్ అనే పదిహేనేళ్ల బాలుడిని చేర్చారు అతని తల్లిదండ్రులు. వీరిది అంబర్ పేట్ లోని బతుకమ్మకుంట. సురేష్ ను పరిశీలించిన వైద్యులు అతనికి మెదడులో చీము చేరిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ కూడా చేశారు. లక్షన్నర బిల్లు కట్టించుకున్నారు.
Samayam Telugu patients family creates ruckus in lotus hospital in hyderabad
చనిపోయాక కూడా చికిత్స చేస్తున్నారంటూ...


ఇంకా అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డబ్బు రెడీ చేసుకోమని తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఇప్పటికే లక్షన్నర కట్టామని ఇక మావల్ల కాదని చెప్పారు. సురేష్ చనిపోయినా కూడా వైద్యం చేస్తున్నారంటూ వైద్యులపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. పోలీసులు వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వారు వినలేదు. వెంటిలేటర్ పై ఉన్న సురేషన్ బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

కాగా వైద్యులు మాట్లాడుతూ బాలుడు బతికే ఉన్నాడని, కోలుకుంటున్నాడని చెప్పారు. అతని కుటుంబసభ్యులు చనిపోయాడనే భ్రమలో ఉన్నారని అన్నారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని చెప్పినా వారు వినడం లేదని అన్నారు. రోగి నాడి, గుండె కొట్టుకునే వేగం అన్నీ పోలీసులకు చూపించామని, కుటుంబసభ్యులు మరణించాడనుకుని బాలుడిని తీసుకుని వెళ్లిపోయారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.