యాప్నగరం

రూ.16 వేలతో బిడ్డ పెళ్లి చేసిన ఐఏఎస్ అధికారి.. టీటీడీ జేఈవోగా.. భేషైన నిర్ణయం!

టీటీడీ జేఈవోగా శ్రీనివాసరాజు స్థానంలో బసంత్ కుమార్‌ను నియమించారు. 8 ఏళ్లపాటు ఈ పదవిలో ఉన్న శ్రీనివాస రాజును ప్రభుత్వం బదిలీ చేసింది.

Samayam Telugu 1 Jul 2019, 5:09 pm
ఇటీవలే టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ పాలక మండలిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే.. మార్పులు మొదలయ్యాయి. రోశయ్య హయాంలో టీటీడీ జేఈవోగా నియమితులైన శ్రీనివాసరాజు స్థానంలో బసంత్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (VMDA) వైస్ చైర్మన్‌గా ఉన్న బసంత్ కుమార్‌కు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించింది. తక్షణమే టీటీడీ జేఈవోగా బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ttd jeo


శ్రీనివాస రాజుకు ప్రభుత్వం ఏ బాధ్యతలూ అప్పగించలేదు. తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.

పి.బసంత్ కుమార్ గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. 2012లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందిన ఆయన.. తర్వాత విశాఖ నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. 2017లో రూ.16,100 ఖర్చుతోనే ఆయన కూతురి పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు. 2019 ఫిబ్రవరిలో రూ.18 వేలతో కుమారుడి పెళ్లి చేసిన ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కుమారుడి పెళ్లికి ఆయన రూ.18 వేలు ఖర్చు పెట్టగా.. వధువు తరఫు వారు రూ.18 వేలు ఖర్చు చేశారు. తన బిడ్డల పెళ్లిళ్లకు అతిథుల దగ్గర్నుంచి ఆయన బొకేలు, గిఫ్టులేమీ తీసుకోలేదు. మీ బహుమానాలు వద్దు.. ఆశీస్సులు చాలని శుభలేఖలోనే స్పష్టంగా ముద్రించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.