పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇరిగేషన్ అధికారులు బుధవారం నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. పోలవరం మండలంలోని ఇటుకలకోట సమీపంలో ఉన్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు మోటార్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ధవళేశర్వం బ్యారేజీ నుంచి గోదావరి అదనపు జలాలను సముద్రంలోకి వదులుతుండటంతో.. నీటి వృథా అరికట్టడం కోసం ఎగువన ఉన్న పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తుండటంపై టీడీపీ స్పందించింది.
పట్టిసీమ శుద్ధ దండగ, మేమూ మా పార్టీ పట్టిసీమకి వ్యతిరేకం అన్న వైఎస్ఆర్సీపీ సర్కారు నేడు అదే పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తోందని చురకలు అంటించింది. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు.. నాలుగు టీఎంసీల పట్టిసీమతో 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఎలా కాపాడతామని.. ఆరోజు ప్రతిపక్ష నేతగా మీ విషయ పరిజ్ఞాన లోపాన్ని చాటుకున్నారని సీఎం జగన్ను ఎద్దేవా చేసింది.
‘‘ఏ ఆగస్టులోనో గోదావరికి వరదలొస్తే జూన్ నెలలోనే కృష్ణా డెల్టాకు నీరెలా ఇస్తారని నాడు అయోమయంగా అడిగారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలో అధికారపక్ష హోదాలోనూ పట్టిసీమ ఖర్చు వృథా ఖర్చు అన్నారు. అది నిజంగా వృథా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది పట్టిసీమ మోటార్లు ఆన్ చేయొద్దని, డెల్టా రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలని అచ్చెన్నాయుడు ఇటీవలే సవాల్ చేశారు. ఆయన ఆ మాటలని నెల కూడా కాకుండానే పట్టిసీమ మోటార్లను ఆన్ చేశారా ముఖ్యమంత్రిగారు?’’ అని ఫేస్బుక్ ద్వారా సీఎం జగన్ను టీడీపీ ప్రశ్నించింది.
నాలుగు రోజులాగి "పట్టిసీమ ద్వారా ఈ ఏడాది డెల్టా రైతుకు ఇన్ని టీఎంసీల నీరిచ్చి, ఇన్ని ఎకరాల పంటను కాపాడాం, గతంలో ఎప్పుడూ లేనంత దిగుబడిని సాధించిన రైతు ప్రభుత్వం మాది'' అని మీ నోట నుంచో, మీ నీటిపారుదల శాఖా మంత్రి నోటి నుంచో వినాలని ఎదురుచూస్తున్నామని ఎద్దేవా చేసింది.
‘‘దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటోగానీ మీరు వద్దన్న పట్టిసీమనే.. మీరు వృథా అన్న పట్టిసీమనే.. చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి, చెమటోడ్చి నిర్మించిన ఈ ప్రాజెక్టునే... నేడు మీరు ఆన్ చేసేలా చేశారు. మీరొచ్చాక వర్షాలు రాక చివరికి పట్టిసీమే దిక్కయింది. జూన్లో నీరెలా ఇస్తారని అన్నారు. జూన్లోనే మీతో నీరు విడుదల చేసేలా చేసింది. వాహ్! చంద్రబాబు! గెలుపంటే మీదే మీదే’’ అని టీడీపీ సోషల్ మీడియా ద్వారా సంబరపడింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మే 23న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. దేవుడి స్క్రిప్ట్ నిజంగా గొప్పందంటూ జగన్ పదే పదే ప్రస్తావించినందుకు కౌంటర్గా టీడీపీ ‘దేవుడి స్క్రిప్ట్’ను తెరమీదకు తెచ్చింది.
పట్టిసీమ శుద్ధ దండగ, మేమూ మా పార్టీ పట్టిసీమకి వ్యతిరేకం అన్న వైఎస్ఆర్సీపీ సర్కారు నేడు అదే పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తోందని చురకలు అంటించింది. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు.. నాలుగు టీఎంసీల పట్టిసీమతో 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఎలా కాపాడతామని.. ఆరోజు ప్రతిపక్ష నేతగా మీ విషయ పరిజ్ఞాన లోపాన్ని చాటుకున్నారని సీఎం జగన్ను ఎద్దేవా చేసింది.
‘‘ఏ ఆగస్టులోనో గోదావరికి వరదలొస్తే జూన్ నెలలోనే కృష్ణా డెల్టాకు నీరెలా ఇస్తారని నాడు అయోమయంగా అడిగారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలో అధికారపక్ష హోదాలోనూ పట్టిసీమ ఖర్చు వృథా ఖర్చు అన్నారు. అది నిజంగా వృథా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది పట్టిసీమ మోటార్లు ఆన్ చేయొద్దని, డెల్టా రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలని అచ్చెన్నాయుడు ఇటీవలే సవాల్ చేశారు. ఆయన ఆ మాటలని నెల కూడా కాకుండానే పట్టిసీమ మోటార్లను ఆన్ చేశారా ముఖ్యమంత్రిగారు?’’ అని ఫేస్బుక్ ద్వారా సీఎం జగన్ను టీడీపీ ప్రశ్నించింది.
‘‘దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటోగానీ మీరు వద్దన్న పట్టిసీమనే.. మీరు వృథా అన్న పట్టిసీమనే.. చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి, చెమటోడ్చి నిర్మించిన ఈ ప్రాజెక్టునే... నేడు మీరు ఆన్ చేసేలా చేశారు. మీరొచ్చాక వర్షాలు రాక చివరికి పట్టిసీమే దిక్కయింది. జూన్లో నీరెలా ఇస్తారని అన్నారు. జూన్లోనే మీతో నీరు విడుదల చేసేలా చేసింది. వాహ్! చంద్రబాబు! గెలుపంటే మీదే మీదే’’ అని టీడీపీ సోషల్ మీడియా ద్వారా సంబరపడింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మే 23న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. దేవుడి స్క్రిప్ట్ నిజంగా గొప్పందంటూ జగన్ పదే పదే ప్రస్తావించినందుకు కౌంటర్గా టీడీపీ ‘దేవుడి స్క్రిప్ట్’ను తెరమీదకు తెచ్చింది.