యాప్నగరం

సీఎం అవుతాను, ఆగమంటే కుదరదు.. పవన్!

రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు.

TNN 7 Dec 2017, 4:03 pm
రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు గురించి, నాయకుల గురించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జరిగిన సంఘటనలను కూడా పవన్ ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. రాజ‌కీయం అంటే సీఎం కావ‌డం కాదని, సామాజిక మార్పు తీసుకురావడ‌మేనని ప‌రోక్షంగా జ‌గ‌న్‌పై విమర్శలు గుప్పించారు. తాను సీఎం అవుతాను.. ఓ ఏడాదిన్నర ఆగండి.. ప‌నులు చేస్తానంటే కుద‌ర‌దని ఎద్దేవా చేశారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చని సలహా ఇచ్చారు.
Samayam Telugu pawan kalyan attacks indirectly to ys jagan mohan reddy
సీఎం అవుతాను, ఆగమంటే కుదరదు.. పవన్!


ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి కమిట్‌మెంట్ లేని వ్య‌క్తులు జ‌న‌సేన‌లో ఉండ‌కూడ‌దని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సైద్ధాంతిక బ‌లంతో జ‌న‌సేన పార్టీ స్థాపించానని, గ‌తంలో బాగా ఆలోచించే బీజేపీ, టీడీపీ కూటమికి మ‌ద్ద‌తు తెలిపాన‌ని అన్నారు. త‌న దగ్గరకు వ‌చ్చి వంద‌ల కోట్లు ఇచ్చేవారు లేర‌ని, ఒక వేళ ఇచ్చినా తాను అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోనని ఆయన స్పష్టం చేశారు. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రికొర‌రు తమ అవినీతిపై పుస్త‌కాలు వేసుకున్నార‌ని, రాష్ట్ర ప‌రిస్థితులు ఇలా ఉంటే పెట్టుబ‌డులు ఎలా పెడ‌తామ‌ని లండ‌న్‌లో కొంద‌రు తనను ప్రశ్నించారని అన్నారు. డ‌బ్బు లేక‌పోయినా రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చ‌ని తాను నిరూపిస్తాన‌ని, స్ప‌ష్ట‌మైన‌ విధి విధానాలతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు.

నిస్వార్థ‌మైన వ్యక్తులు ప్ర‌జారాజ్యంలో ఉండుంటే ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండేదని, ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న చిరంజీవికి ఉండేదని వ్యాఖ్యానించారు. తనను కులనాయకుడిని చేద్దామని ప్రయత్నిస్తే ఒప్పుకోనని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణ‌య్య‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి 2014 ఎన్నికల మ్యానిఫేస్టోలోనే దీనిని చేర్చాచని, అప్పుడెందుకు కృష్ణ‌య్య‌ వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. బలప్రదర్శన ద్వారా రిజర్వేషన్లు సాధించలేరని అన్నారు. కొందరు రిజర్వేషన్లు అడుగుతున్నారంటే అది రాజకీయ నాయకుల వైఫల్యమేనని, రాజకీయ పునర్నిర్మాణం కోరుకున్న వాళ్లే నా వెంట నడవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

తన భార్య నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారని, ప్ర‌త్యేకహోదాపై పరకాల ప్రభాకర్ ఎందుకు మాట్లాడ‌రని? ఈ విషయంపై ప్రధానిని నిలదీయలేరా అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. హోదాపై తానొక్క‌డినే మాట్లాడాలా? అని నిల‌దీశారు. గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై వారు క‌స్సున లేచార‌ని, మ‌రి వారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.