పీఆర్పీ కారణంగానే నా పరిస్థితి ఇలా అయ్యింది: పవన్
Jana Sena Chief Pavan Kalyan: సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానంపై, తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు.
TNN 2 Sep 2017, 9:42 am
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానంపై, తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు. జనసేన పార్టీ నిర్మాణం కోసం చేపట్టిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా జనసేన సైనికులని ఉద్దేశించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. అనేక అంశాలపై వివరణ ఇచ్చారు.
సీపీఎంతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్న పవన్ కల్యాణ్... పీఆర్పీ మిగిల్చిన చేదుజ్ఞాపకాలని సైతం ఈ వేదికపై నెమరేసుకున్నారు. గతంలో పీఆర్పీతో కలిసి పనిచేసిన కారణంగానే ఇప్పుడు తనపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ప్రతీ ఆరోపణకు తాను వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవేళ తనకి పీఆర్పీతో సంబంధం లేకుండా తాను ఒక్కడిగానే రాజకీయాల్లోకి వచ్చి వుంటే, ఇవాళ ఈ దుస్థితి వుండేది కాదేమో అని ఆవేదన వ్యక్తంచేశారు పవన్.
ఈ సందర్భంగా జనసేన డిజిటల్ రెజిమెంట్కి శతజ్ఞి అని నామకరణం చేసిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
-> 175 స్థానాల్లో పోటీ చేస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను కానీ 2018 ఆఖర్లో కచ్చితంగా ఈ అంశంపై ఓ స్పష్టత ఇస్తాను.
-> జనసేన పార్టీ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే వుంది.
-> ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదు.
-> అక్టోబర్ నుంచి జనం మధ్యలోకి వస్తాను.
-> కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ అంశంపై ఓ సెమినార్ నిర్వహించాలనుకుంటున్నాను.
-> నా దృష్టిలో దేశమంతా సమానమే. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం అయ్యే మనిషిని కాను. ఎవ్వరు, ఎక్కడ ఏ సమస్య వుందని పిలిచినా వారికి అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్తాను.
-> నా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
సీపీఎంతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్న పవన్ కల్యాణ్... పీఆర్పీ మిగిల్చిన చేదుజ్ఞాపకాలని సైతం ఈ వేదికపై నెమరేసుకున్నారు. గతంలో పీఆర్పీతో కలిసి పనిచేసిన కారణంగానే ఇప్పుడు తనపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ప్రతీ ఆరోపణకు తాను వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవేళ తనకి పీఆర్పీతో సంబంధం లేకుండా తాను ఒక్కడిగానే రాజకీయాల్లోకి వచ్చి వుంటే, ఇవాళ ఈ దుస్థితి వుండేది కాదేమో అని ఆవేదన వ్యక్తంచేశారు పవన్.
ఈ సందర్భంగా జనసేన డిజిటల్ రెజిమెంట్కి శతజ్ఞి అని నామకరణం చేసిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
-> 175 స్థానాల్లో పోటీ చేస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను కానీ 2018 ఆఖర్లో కచ్చితంగా ఈ అంశంపై ఓ స్పష్టత ఇస్తాను.
-> జనసేన పార్టీ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే వుంది.
-> ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదు.
-> అక్టోబర్ నుంచి జనం మధ్యలోకి వస్తాను.
-> కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ అంశంపై ఓ సెమినార్ నిర్వహించాలనుకుంటున్నాను.
-> నా దృష్టిలో దేశమంతా సమానమే. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం అయ్యే మనిషిని కాను. ఎవ్వరు, ఎక్కడ ఏ సమస్య వుందని పిలిచినా వారికి అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్తాను.
-> నా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.