జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పవన్... మరింత దూకుడు పెంచారు. ఓ నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని మరోసారి టీడీపీ అధినేతపై మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అవినీతి గురించి సీఎంకు తెలుసన్నారు. గతంలో ఎన్నోసార్లు ఆయన్ను హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. అవినీతి గురించి కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు స్వయంగా తనతో చెప్పారన్నారు పవన్. జరిగిన అవినీతి... మంత్రి లోకేష్కు ఉన్న లింకులపై న్యాయ విచారణ జరపాలన్నారట. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నిస్తే... కేసీఆర్కు 10కి 6 మార్కులు... చంద్రబాబుకు 2.5 మార్కులు ఇస్తానన్నారట.
ప్రత్యేక హోదా అంశంపైనా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా అనేది పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ అని... ప్రజల్లో ఎలాంటి పట్టింపు లేదని వ్యాఖ్యానించారట. హోదా అయినా.... ప్యాకేజైనా ఏపీకి నిధులు రావడం ముఖ్యమని అభిప్రాయపడ్డారట. ఇక థర్డ్ ఫ్రంట్పై మాట్లాడేందుకు పవన్ నిరాకరించారట. మోదీతో సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమేననని... అయితే బీజేపీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పుకొచ్చారట.
ప్రత్యేక హోదా అంశంపైనా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా అనేది పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ అని... ప్రజల్లో ఎలాంటి పట్టింపు లేదని వ్యాఖ్యానించారట. హోదా అయినా.... ప్యాకేజైనా ఏపీకి నిధులు రావడం ముఖ్యమని అభిప్రాయపడ్డారట. ఇక థర్డ్ ఫ్రంట్పై మాట్లాడేందుకు పవన్ నిరాకరించారట. మోదీతో సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమేననని... అయితే బీజేపీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పుకొచ్చారట.