యాప్నగరం

‘ఎవరి రాజధాని అమరావతి’: రచన ఐవైఆర్‌, ఆవిష్కరణ పవన్

రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర అంశాలతో కూడిన ముఖ్యవిషయాలను తెలియజేస్తూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం నాడు ఆవిష్కరించారు.

Samayam Telugu 5 Apr 2018, 8:16 pm
‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర అంశాలతో కూడిన ముఖ్యవిషయాలను తెలియజేస్తూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఈ పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం నాడు ఆవిష్కరించారు. విజయావాడలో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పుస్తక రచయిత ఐవైఆర్ కృష్ణారావుతో పాటు సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ సందర్భంగా పుస్తక రచయిత ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఛండీగఢ్, భువనేశ్వర్‌, రాయ్‌పూర్‌, రాంచీ లాంటి రాజధానులను ఏ ప్రాతిపదికన కట్టారు, అసలు ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల నిర్మాణాల అనుభవాలేంటి? తదితర అంశాలను కూలంకశంగా పరిశీలించి ఒక పుస్తకం రాశానని ఐవైఆర్‌ చెప్పారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి అంకితం చేస్తున్నానన్నారు ఐవైఆర్‌ కృష్ణారావు.

ఇక పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఇదేదో ఒక పార్టీకి చెందినదిగా కాకుండా.. రాష్ట్ర ప్రజలందరికీ చెందినదే భావన ప్రజల్లో తీసుకురావాలని ఆకాక్షించారు పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.