యాప్నగరం

TDP ప్రభుత్వం నుంచి పవన్‌కు ప్రాణహాని!

టీడీపీ ప్రభుత్వం నుంచి పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉంది. పచ్చ మీడియా ఆయనకు హాని తలపెట్టే అవకాశం ఉందని అమరావతి స్టేట్ కాపు నాడు ప్రెసిడెంట్ ఎస్. శ్రీనివాస రావు ఆరోపించారు.

Samayam Telugu 25 Apr 2018, 3:11 pm
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి, చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ పార్టీతో పోరుకు సై అంటున్నారు. జనసేన ప్లీనరీ జరిగిన నాటి నుంచి టీడీపీతో సంబంధాలు తెంచుకున్న ఆయన.. లోకేశ్ అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల శ్రీరెడ్డి తన తల్లిని దూషించడం వెనుక టీడీపీ అనుకూల మీడియా ప్రమేయం ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు.
Samayam Telugu pk21


ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. జనసేన పార్టీ టీడీపీకి మరింత దూరం జరుగుతున్న దాఖలాలే కనిపిస్తున్నాయి. పాత మిత్రుడి పట్ల తెలుగు దేశం నేతలు కాస్త ఆచితూచి అడుగేస్తున్నారు. కానీ జనసేన, కాపు నాయకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ సర్కారు నుంచి పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉందని అమరావతి స్టేట్ కాపు నాడు ప్రెసిడెంట్ ఎస్. శ్రీనివాస రావు ఆరోపించారు.

చంద్రబాబు కనుసన్నల్లో నడిచే పచ్చ మీడియా పవన్‌కు హాని తలపెట్టే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస రావు వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

సీఎం, ఆయన కుమారుడు పవన్ పట్ల అసహనంతో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్న జనసేనాని పట్ల అసహనంతో ఉన్నారు. మీడియాకు లోకేశ్ కోట్లాది రూపాయల ముడుపులు చెల్లిస్తున్నారని శ్రీనివాస రావు ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.