యాప్నగరం

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పవన్.. పోలీసుల తంటాలు

లష్కర్ బోనాలను పురష్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.

Samayam Telugu 29 Jul 2018, 3:24 pm
లష్కర్ బోనాలను పురష్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అమ్మవారిని దర్శించుకుని వెళ్లిన అనంతరం పవన్ కళ్యాణ్ మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చారు. పవన్ వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. కార్ గ్లాస్ రూఫ్‌లో నుంచి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు ప్రయత్నించారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. మొత్తానికి అమ్మవారిని దర్శించుకున్న పవన్.. ప్రత్యేక పూజలు చేసి వెళ్లారు.
Samayam Telugu Pawan1

కాగా, ఆదివారం ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత ఆదయ్యనగర్‌ కమాన్‌ వద్ద నుంచి ఎంపీ కవిత బంగారు బోనంతో వచ్చి మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ధూం ధాం డప్పులతో ఊరేగింపుగా కవిత బోనంను తీసుకొచ్చారు. మొత్తం 1008 బోనాలతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బంగారు బోనం సమర్పించారు. ఈ ర్యాలీలో మ్రంతులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.