యాప్నగరం

టీడీపీపై మరోసారి పవన్ విమర్శలు.. మీది రెండు నాల్కల ధోరణి!

టీడీపీ ప్రభుత్వంపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీది రెండు నాల్కల ధోరణి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

Samayam Telugu 22 Jul 2018, 12:27 pm
టీడీపీ ప్రభుత్వంపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీది రెండు నాల్కల ధోరణి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ తర్వాత వరుసగా ట్వీట్లతో విరుచుకుపడుతోన్న పవన్ టీడీపీ వైఖరిపై మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన నుంచి అవిశ్వాస తీర్మానం వరకూ టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిందని దుయ్యబట్టారు. సరైన పద్దతి లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీలోని యువతరంతో పాటు సాధారణ ప్రజలు ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికంగా వెనుకబడి పోయారని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏపీ ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్వవహరించాల్సి ఉందన్నారు.
Samayam Telugu పవన్ కల్యాణ్ విమర్శలు



ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్ర వైఖరిని నిరసిస్తూ తిరుపతి, కాకినాడలో తాను బహిరంగసభలను నిర్వహించినప్పుడు అప్పుడు టీడీపీ వాదన ఎలా ఉందనేది సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన ట్విట్టర్‌లో ఉంచారు. అధికారంలో ఉన్నవారే విభజన హామీల అమలు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకు అనగుణంగా మాటలు మారుస్తున్నారంటూ శనివారం నాడు టీడీపీపై పవన్ వాగ్భాణాలు సంధించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేకూరే వరకూ పోరాటం చేయాలని, ఒకరోజు బంద్‌తోనే, కాగడాల ప్రదర్శనలతో ఒరిగేది ఏమీ ఉండదంటూ చురకలంటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆదివారం నాడు ఉండవల్లిలో రైతులతో పవన్ సమావేశమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.