యాప్నగరం

అకీరాతో కలిసి పటమటలో కొత్త ఇంట్లోకి పవన్; హైదరాబాద్‌లోనూ..

రాజకీయాల్లో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ ఒకే రోజు రెండు కీలక పనులకు శ్రీకారం చుట్టారు. బెజవాడ పటమట లంకలో అద్దె ఇంట్లోకి కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేశారు.

Samayam Telugu 22 Jun 2018, 2:09 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయంగా దూకుడు పెంచారు. పోరాట యాత్రతో జనంలోకి చొచ్చుకెళ్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకున్న ఆయన మరి కొద్ది రోజుల్లో రెండో విడత పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏపీ ప్రజలకు దగ్గర ఉండేందుకు, మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు పవన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలోని పటమట లంకలో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
Samayam Telugu pk-patamata-house


శుక్రవారం ఉదయం ఆ ఇంట్లోకి పవన్ తొలిసారి అడుగు పెట్టారు. తన పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పవన్ ఆ ఇంట్లోకి వెళ్లడం విశేషం. అనంతరం ఇంట్లో పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ దంపతులు గతంలో గుంటూరు సమీపంలోని ఖాజా వద్ద కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఆ బీజేపీ ఎంపీ ఇంటికి చేరువగా.. పవన్ కొత్త ఇల్లు వివరాలివే!

విజయవాడలో పవన్ కల్యాణ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన రోజే హైదరాబాద్‌లో జనసేన నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషం. మాదాపూర్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో పార్టీ కొత్త ఆఫీసును ప్రారంభించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న ఆఫీస్ చిన్నది కావడంతో మాదాపూర్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని మిగతా పట్టణాల్లోనూ త్వరలోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన నేతలు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.