యాప్నగరం

శ్రీని రాజు లీగల్ నోటీసులపై పవన్ రియాక్షన్!

శ్రీని రాజు లీగల్ నోటీసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీని రాజు లాయర్‌కు తనదైన శైలిలో బదులిచ్చారు.

Samayam Telugu 23 Apr 2018, 3:35 pm
తన తల్లిని శ్రీరెడ్డి దూషించడం, కొన్ని మీడియా ఛానెళ్లు పదే పదే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంతో జనసేనాని నొచ్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగా తన తల్లిని తిట్టించారనే భావనలో ఉన్న ఆయన ఏబీఎన్, టీవీ9, టీవీ5 ఛానెళ్ల అధిపతులు లక్ష్యంగా ట్వీట్లు పెడుతున్నారు. టీవీ9 రవి ప్రకాష్, శ్రీని రాజు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలను టీడీపీ అనుకూల వర్గంగా పేర్కొన్న ఆయన వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలోకి తనను అనవసరంగా లాగినందుకు శ్రీని రాజు ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు లీగల్ నోటీసులు పంపారు.
Samayam Telugu Pawan-Kalyan-Facebook


శ్రీని రాజు పంపిన లీగల్ నోటీసులకు జనసేన అధినేత లేఖ ద్వారా ఘాటుగా బదులిచ్చారు. ట్విట్టర్ ఖాతాలో నేను ట్వీట్లు నా అభిప్రాయాలు. అవి నా భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినవని ఆయన శ్రీని రాజు లాయర్‌కు సమాధానం ఇచ్చారు.

నేను చేసిన ట్వీట్‌ ఏ రకంగానూ మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా లేదు. ఆయనెందుకు స్పందించారో అర్థం కావడం లేదు. మీ ద్వారా ఆయన స్పందించడం ఆశ్చర్యం కలిగించిందని పవన్ తెలిపారు.

మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పరోక్ష ఆరోపణలు చేయలేదు. మనసు లోతుల్లోని అపరాధ భావంతో ఆయన తనకేదో ఊహించుకుంటున్నారు. టీవీ9, శ్రీసిటీ అనేవి మీ క్లయింట్‌కు చెందినవే విషయం సమాజానికి తెలిసినవే.

ట్వీట్టర్ ద్వారా నేను శ్రీని రాజుపై ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయలేదు. నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాను. దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేరు. నా పట్ల మీ క్లయింట్‌కు అంచనాలు, ఆశలు ఉండటం ఆనందాన్నిస్తోంది. లక్ష్యం నుంచి నేనెప్పుడూ దారి మళ్లలేదని శ్రీని రాజు లాయర్ సునీల్ రెడ్డికి పవన్ సూచించారు.

మరో ట్వీట్ ద్వారా శ్రీని రాజు టీడీపీకి భారీ మొత్తంలో ఇచ్చిన విరాళం వివరాలను పవన్ కల్యాణ్ బయటపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.