యాప్నగరం

నన్ను బీజేపీ, టీడీపీ వాడుకున్నాయి : పవన్

నేను టీడీపీ కానీ బీజేపీకి కానీ మద్దతు పలికినప్పుడు, నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు అని ఏరోజూ అడగని...

Samayam Telugu 27 Jan 2017, 10:47 am
నేను టీడీపీ కానీ బీజేపీకి కానీ మద్దతు పలికినప్పుడు, నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు అని ఏరోజూ అడగని ఆ రెండు పార్టీలు ఇవాళ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే మాత్రం నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తంచేశారు పవన్. వారి అవసరాల కోసం నన్ను కర్టాటక, ఏపీ, తెలంగాణ మొత్తం పంపించి తిప్పించారు. ఇక ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే, నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు!? ముందుగా రాజకీయాలు నేర్చుకుని రా అని అంటున్నారు. అంటే నన్ను వారి అవసరాల కోసం వాడుకునేటప్పుడు నా రాజకీయ పరిజ్ఞానంతో వారికి పనిలేదన్నమాట అంటూ ఇంతకన్నా అవకాశవాద రాజీకీయం ఇంకొకటి ఉంటుందా ? అని ఆ రెండు పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు పవన్ కల్యాణ్.
Samayam Telugu pawan kalyan sensational comments on pm narendra modi and cm chandrababu
నన్ను బీజేపీ, టీడీపీ వాడుకున్నాయి : పవన్


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఇంతకాలంలో నేనెప్పుడు ఎవ్వరినీ అంతగా ప్రశ్నించలేదు. అందుకు కారణం ప్రతీది ఓ రూల్ బుక్ ప్రకారం వేళ్తే కష్టం అని తెలుసుకాబట్టి. ఓట్లకు నోట్లు విషయంలో నేను మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. ప్రతీ విషయంలో గొడవలు పెట్టుకుంటూ పోతే పనులు ముందుకు వెళ్లవు, సమస్యలు పరిష్కారం కావు అనే ఉద్దేశంతోనే నేను అప్పుడు మాట్లాడలేదు. అంతే కానీ వాళ్లను వెనకేసుకొచ్చే ఉద్దేశంతో మాత్రం కాదు అని తనపై వచ్చిన ఆరోపణలకి వివరణ ఇచ్చారు పవన్.

ఇక్కడి యువతకి అన్యాయం జరిగిపోతుందనే ఆవేదన కారణంగానే తెలంగాణ యువత అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేసింది. అలాగే అక్కడి యువత కూడా తమకి మంచి భవిష్యత్ కావాలనే కోరుకుంటోంది. కానీ అదే యువత కోరుకున్నవి నెరవేరనప్పుడు ప్రభుత్వాలని ప్రశ్నించకూడదా అని అన్నారు పవన్. ఏ బంగారు తెలంగాణ అయితే సాధిస్తామని రూలింగ్‌లోకి వచ్చారో వాళ్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం విమర్శించారు పవన్.

బీజేపీ నుంచి ఒక బలమైన డెమొక్రసీ కావాలని కోరుకుంది యువత. కానీ బీజేపి మాత్రం ఒంటెద్దు పోకడలు పోతోంది. రోహిత్ వేముల ఆత్మహత్య, పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ వివాదం, డీమానిటైజేషన్... ఇలా ఇవన్నీ బీజేపీ ఒంటెద్దు పోకడలకి అద్దం పడుతున్నాయి. బీజేపిని కానీ ఆ పార్టీ నాయకులని కానీ ఎంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ వాళ్లు మాత్రం ప్రజాసమస్యల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు పవన్. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.