యాప్నగరం

ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది: పవన్

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ హీరో..

TNN 21 Apr 2017, 9:01 pm
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ హీరో పవన్‌కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. భారీ లోడుతో వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని డీకొట్టి, పక్కనే ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. లారీ బీభత్సానికి తోడు విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల మంటలు చెలరేగి మరికొందరు ప్రాణాలు వదిలారు.
Samayam Telugu pawan kalyan shocks over yerpedu lorry accident
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది: పవన్


ఈ ఘటనపై పవన్ స్పందిస్తూ.. ‘లారీ అదుపుతప్పి 20 మంది ప్రాణాలను బలితీసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి మానవ తప్పిదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ హృదయ విదారక ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మేలైన చికిత్స అందించాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తగినంత నష్ట పరిహారం చెల్లించాలి’ అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.