యాప్నగరం

చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యకరం: పవన్

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఐఏఎస్‌ను నియమించడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TNN 8 May 2017, 1:54 pm
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఐఏఎస్‌ను నియమించడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకంపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ సోమవారం ట్వీట్ చేశారు.
Samayam Telugu pawan kalyan slams ap cm chandrababu naidu against ttd eo appointment
చంద్రబాబు నిర్ణయం ఆశ్చర్యకరం: పవన్


‘టీటీడీలో ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్‌ను నియమించాలనే నిర్ణయానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ ఓ దక్షిణ భారత ఐఏఎస్‌ను ఉత్తర భారతదేశంలో ఇలాంటి పదవుల్లో కూర్చోబెట్టారా.. అమర్‌నాథ్, వారణాసి, మధుర వంటి ఉత్తర భారత పుణ్యక్షేత్రాల్లో మన ఐఏఎస్‌లను నియమించారా? దక్షిణ భారత ఐఏఎస్‌లను వారు అనుమతించనప్పుడు మనమెందుకు వాళ్లని ఇలాంటి పదువుల్లో నియమించుకోవాలి. దీనికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడంలేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దక్షిణ భారతీయులకు ఆయన సమాధానం చెప్పాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.
pic.twitter.com/9ohFTEuF3p — Pawan Kalyan (@PawanKalyan) May 8, 2017
కాగా, టీటీడీ ఈవోగా ఉన్న సాంబశివరావును ఆ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తితిదే ఈవోగా తెలుగువారినే నియమించడం సంప్రదాయంగా వస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.