యాప్నగరం

హీరో కాకముందే సమాజం గురించి ఆలోచించా: పవన్

బ్రాహ్మణులంటే తనకు ఎంతో అభిమానమని.. అందుకు కారణం తన తండ్రేనని తెలిపారు. చిన్నప్పట్నుంచీ దేశభక్తుల కథలు విని పెరిగిన తనకు సమాజంపై పూర్తి అవగాహన ఉందన్నారు.

Samayam Telugu 25 Nov 2018, 2:35 pm
ఈ దేశంలో కులాలు, మతాల కంటే ముఖ్యంగా ఉండాల్సింది ధర్మమేనని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల సమాఖ్య సమావేశంలో పవన్ పాల్గొన్నారు.
Samayam Telugu Pawan


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులంటే తనకు ఎంతో అభిమానమని.. అందుకు కారణం తన తండ్రేనని తెలిపారు. చిన్నప్పట్నుంచీ దేశభక్తుల కథలు విని పెరిగిన తనకు సమాజంపై పూర్తి అవగాహన ఉందన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని.. హీరో కాకముందే సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండేదన్నారు.

చిన్న ఆలయాల్లో పూజలు చేసే అర్చకులే ఎన్నో సంవత్సరాలు సాధన చేసి వేద మంత్రాలు నేర్చుకుంటుంటే.. ప్రజలను పాలించే రాజకీయ నేతలు ఇంకెంత సాధన చేయాలని అన్నారు. తాను పదేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని.. 2014లో ఓ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేందుకు సాయం చేశానని పవన్ తెలిపారు. అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పోరేషన్‌కు నిధులు పెంచుతామని పవన్ హామీ ఇచ్చారు.

చిన్నారికి నామకరణం చేసిన పవన్
సమావేశంలో పవన్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఓ జంట తమ చిన్నారితో కలిసి ఆయన వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని ఆయన్ని కోరారు. ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన జనసేనాని.. ’బాల లలిత’ అని నామకరణం చేశారు. దీంతో ఆ దంపతులు మురిసిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.