యాప్నగరం

పరిటాల ఇంట్లో అల్పాహార విందుకు పవన్!

పవన్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తున్నారు. ఈ పర్యటన శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

TNN 28 Jan 2018, 10:59 am
అనంతపురం పర్యటనలో ఉన్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. కదిరికి బయలుదేరే ముందు సునీత నివాసానికి చేరుకున్న పవన్‌ను పరిటాల శ్రీరామ్ ఎదురెళ్లి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. పవన్‌ తమ ఇంటికి అతిథిగా వస్తున్నారని తెలుసుకున్న మంత్రి సునీత అల్పాహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వయంగా ఆమే వంటకాలను సిద్ధం చేశారు. ఇడ్లీ, వడ, దిబ్బరొట్టెతోపాటు రాయలసీమకే ప్రత్యేకమైన రాగి సంకటి, పొంగల్‌ను తయారుచేయించారు. పరిటాల కుటుంబంతో కలిసి పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సునీతతో దాదాపు గంటపాటు అనేక విషయాలపై పవన్ చర్చించినట్లు సమాచారం.
Samayam Telugu pawan kalyan visited today ap minister paritala sunitha residence
పరిటాల ఇంట్లో అల్పాహార విందుకు పవన్!


రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడుకున్నట్టు భోగట్టా. జిల్లాలో మూడు రోజుల పర్యటన కోసం శనివారం ఉదయం పవన్ కల్యాణ్ అనంతపురం పట్టణానికి చేరుకుని, జనసేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం రైతులు, వ్యవసాయ, నీటిపారుదల రంగ నిపుణులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. రాత్రికి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కూడా పవన్ భేటీ అయ్యారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని గతంలోనే జనసేనాని ప్రకటించిన వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నేడు కదిరి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రేపు ధర్మవరంలో చేనేత కార్మికులతో సమావేశమవుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.