యాప్నగరం

పాలకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో చురకలేసిన పవన్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

Samayam Telugu 13 Jan 2017, 10:08 pm
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ తనదైన స్టైల్లో పాలకులకి చురకలంటించారు. జనసేన పార్టీ తరపున ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన ప్రకటనలో.. " ఈ సంక్రాంతి పాలకుల్లో క్రాంతిని నింపాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు దోహదపడాలి" అని పేర్కొన్నారు పవన్.
Samayam Telugu pawan kalyan wishes a happy pongal to all indians
పాలకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో చురకలేసిన పవన్


అంతేకాకుండా ఈ సంక్రాంతి తీసుకువచ్చే క్రాంతి కరెన్సీ రద్దు వంటి గాయాలని మరోమారు చేయకూడదు అని కోరుకుంటున్నట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకి కూడా ఈ సంక్రాంతి స్వాంతన కలగజేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.