యాప్నగరం

కచ్చితంగా 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై అధ్యయనానికి నటుడు, జనసేన అధినేత పవన కల్యాణ్ పోరాట యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 20 May 2018, 12:59 pm
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై అధ్యయనానికి నటుడు, జనసేన అధినేత పవన కల్యాణ్ పోరాట యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘పెద్దల ఆశీస్సులతో, యువత మద్దతుతో, అక్కాచెల్లెళ్ల తోడుతో 2019కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని పవన్ ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసమే పోరాట యాత్ర చేపట్టినట్లు పవన్‌ స్పష్టం చేశారు. మిగతా రాజకీయ పార్టీలకు, జనసేన పార్టీకి తేడా ఉందన్న పవన్‌, ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఉద్ఘాటించారు.
Samayam Telugu పవన్ కల్యాణ్


శ్రీకాకుళం వలసలను నివారించే బాధ్యత తాను తీసుకుంటానని పవన్‌ హామీ ఇచ్చారు. జనసేన అధికారంలోకి రాగానే కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలు కష్టపడితే తాను సీఎం అవుతానని అన్నారు. యాత్ర పూర్తయిన నాలుగు నెలల తర్వాత మరోసారి శ్రీకాకుళంలో పర్యటిస్తానని పవన్ పేర్కొన్నారు.

కాగా, పవన్ తొలి దశ పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేసిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.