యాప్నగరం

అలాచేస్తే.. సీఎం ఇంటి ముందే ధర్నా: పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ బుధవారం (జులై 4) మాట్లాడుతూ.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రని అమ్మేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 4 Jul 2018, 8:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ పెందుర్తిలో బుధవారం (జులై 4) జరిగిన సభలో మాట్లాడుతూ.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రని అమ్మేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నిర్వహిస్తున్న సభలకు అడ్డుపడాలని ప్రభుత్వం అడ్డుపడాలని చూస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తానని తెలిపారు. భూకబ్జాలు జరుగవనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతిచ్చానని పవన్ తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌పై చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
Samayam Telugu Untitled


పెట్రోలియం వర్సిటి కోసం 300 ఎకరాలు లాక్కున్నారు. ఎమ్మెల్యేల భూదోపిడి సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లంకెలపాలెం రైల్వేబ్రిడ్జిపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్లమెంట్‌లో జీరో అవర్‌లో ఎందుకు మాట్లాడలేదన్నారు. రైల్వే బ్రిడ్జే సాధించని వాళ్లు రైల్వేజోన్ సాధిస్తారా? అని ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్నలు సంధించారు. ఉత్తరాంధ్రకు అండగా నిలబడటానికి వచ్చానేగాని.. వారిలాగా దోపీడి చేయడానికి కాదని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.