జనసేన అధిపతి పవన్ కల్యాణ్ సంచలనాత్మక ట్వీట్స్ను చేశారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మరోవైపు సంచలన ఆరోపణలు చేశారు పవన్. గత కొన్ని రోజు లుగా జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తూ, కొన్ని మీడియా సంస్థల పేర్లను సైతం ప్రస్తావిస్తూ పవన్ వరస ట్వీట్లను పెట్టారు. తనపై ఏపీ సచివాలయం వేదికగా కుట్ర జరిగింది అని పవన్ కల్యాణ్ పేర్కొనడం గమనార్హం. పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ ఈ కుట్ర చేయించారు అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పవన్ చేసిన సంచలన ట్వీట్లు ఇలా ఉన్నాయి...
రూ.పది కోట్లతో లోకేష్ కుట్ర ఇది: పవన్ ట్వీట్
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ సంచలనాత్మక ట్వీట్స్ను చేశారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మరోవైపు సంచలన ఆరోపణలు చేశారు పవన్
Samayam Telugu 20 Apr 2018, 7:10 am