జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ స్పందించారు. ‘‘పవన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి ఎవరో చెబితే అన్నానని అన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న.. విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నింటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. పవన్ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంది’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
పవన్.. నీ వ్యాఖ్యలు బాధించాయి: లోకేష్
రూ.10 కోట్లతో లోకేష్ తనపై కుట్ర పన్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందించారు.
Samayam Telugu 20 Apr 2018, 10:33 pm