వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన బీటెక్ దొంగపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీయాక్ట్ నమోదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చావా సూరజ్ ఇంజనీరింగ్ చదవటానికి నగరానికి వచ్చాడు. బాల్య స్నేహితుడు... బీటెక్ చదువుతున్న పవన్కుమార్ గదిలో దిగాడు. వీరికి మరో ఇద్దరు స్నేహితులు పరిచయమయ్యారు. నలుగురూ జల్సాలకు అలవాటపడ్డారు. జల్సాల చేయటానికి డబ్బు కోసం దొంగతనాలు చేయాలనుకున్నారు. వనస్థలిపురం, హయత్నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్నగర్ తదితర ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. 18 చైన్స్నాచింగ్లు చేసిన సూరజ్పై పీడీయాక్ట్ ప్రయోగించారు.
సూరజ్ అనే ఈ నేరస్థుడు నగరంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నత విద్య కోసం వచ్చాడు. అక్కడఇంజినీరింగ్ చదివే క్రమంలో తన పాఠశాల మిత్రులైన మామిడి రోహిత్ కుమార్, మహమ్మద్ ఒవైస్ అహ్మద్ అనే ఇద్దరిని కలుసుకున్నాడు. అందరూ కలిసి ఒకే గదిలో అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు ఆల్కహాల్కు బానిసలయ్యారు. మద్యంతో పాటు ధూమపానం, మరిజువా అనే మత్తు పదార్థానికి బాగా అలవాటు పడ్డారు. వీటన్నింటికి డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డారు. మొదట చైన్ స్నాచింగ్తో వీరి దురలవాట్లు మొదలయ్యాయి. వీళ్లంతా ఎక్కువగా ఎల్బీ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సూరజ్ అనే ఈ నేరస్థుడు నగరంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నత విద్య కోసం వచ్చాడు. అక్కడఇంజినీరింగ్ చదివే క్రమంలో తన పాఠశాల మిత్రులైన మామిడి రోహిత్ కుమార్, మహమ్మద్ ఒవైస్ అహ్మద్ అనే ఇద్దరిని కలుసుకున్నాడు. అందరూ కలిసి ఒకే గదిలో అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు ఆల్కహాల్కు బానిసలయ్యారు. మద్యంతో పాటు ధూమపానం, మరిజువా అనే మత్తు పదార్థానికి బాగా అలవాటు పడ్డారు. వీటన్నింటికి డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డారు. మొదట చైన్ స్నాచింగ్తో వీరి దురలవాట్లు మొదలయ్యాయి. వీళ్లంతా ఎక్కువగా ఎల్బీ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.