యాప్నగరం

బుల్లెట్ దిగిందా.. అరాచకం, వీళ్లా మనల్ని పాలించేది?: లోకేశ్ ట్విటైర్లు

YSRCP | అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై ప్రజాస్పందన ఎలా ఉందో లోకేశ్ ట్వీట్ చేశారు. వీళ్లా మనల్ని పాలించేందంటూ.. ఓ సామాన్యుడి స్పందనను ట్వీట్ చేశారు.

Samayam Telugu 18 Jul 2019, 1:07 pm
ఏపీలో అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీ నేత నారా లోకేశ్.. మరోసారి అధికార పార్టీ తీరును ఎండగట్టారు. అరాచకంపై ప్రజల మాట అని ట్వీట్ చేసిన ఆయన.. సభలో వైఎస్ఆర్సీపీ నేతల తీరుపట్ల సామాన్యుడి స్పందన ఇలా ఉందంటూ ఆయన ఓ వీడియోను వదిలారు. 40 ఏళ్లా..? ఎన్నేళ్లా అనేది కాదు... అన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల పట్ల ఓ వ్యక్తి స్పందిస్తూ.. బుల్లెట్ దిగిందా లేదా? అంటే వీడు ఎమ్మెల్యేనా? లేదంటే వీధి రౌడీనా అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
Samayam Telugu lokesh1


సభలో జగన్ అసహనంతో మాట్లాడుతూ.. కూర్చోవయ్యా కూర్చో కూర్చో అనడం పట్ల అతడు స్పందిస్తూ.. ఓ మాజీ సీఎంను పట్టుకోని హే... కూర్చోవయ్యా అంటున్నావంటే.. వాళ్లు 23 మంది.. మా వాళ్లు 150 మందిమి తలుచుకున్నామంటే..? ఎలా..? మీరెంత? అనడం అంటే రౌడీ విధానమే కదా.. అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు.

లోకేశ్ పోస్టు పట్ల నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. టీడీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతల తీరు పట్ల విమర్శలు గుప్పిస్తుండగా.. వైఎస్ఆర్సీపీ అభిమానులు మీ హయాంలో జరిగిన వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. సభలో జగన్ కూర్చోవయ్యా అన్నది చంద్రబాబును కాదు.. అచ్చెన్నాయుడిని అని గుర్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.