యాప్నగరం

ప్రాణం పోయమంటే.. ఫొటోలు తీసుకున్నారు!

టెక్నాలజీ మనుషులను ఇంత మూర్ఖులుగా మార్చేస్తుందా? తోటి మనిషి ప్రాణం కోసం కొట్టిమిట్టాడుతుంటే రక్షించకుండా ఫొటోలు తీసుకుంటున్న అలాంటి మనుషులను ఏమనాలి?

Samayam Telugu 30 Mar 2018, 10:42 pm
టెక్నాలజీ మనుషులను ఇంత మూర్ఖులుగా మార్చేస్తుందా? తోటి మనిషి ప్రాణం కోసం కొట్టిమిట్టాడుతుంటే రక్షించకుండా ఫొటోలు తీసుకుంటున్న అలాంటి మనుషులను ఏమనాలి? బాధితుడి ఆర్తనాదాలు వినకుండా వీడియోలు తీస్తున్నవాళ్లను ఏం చేయాలి? ఖమ్మం జిల్లాలో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu police


ఖమ్మం రూరల్‌ డివిజన్‌ పరిధిలోని రఘునాథ్‌పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న బీ భాస్కర్‌ శుక్రవారం ఉదయం సమీపంలోని ఓ గ్రామానికి బందోబస్తుకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన జీపు దిగి రోడ్డు దాటుతుండగా ఓ లారి ఆయన్ని ఢీకొట్టింది. టైర్లు ఆయన కడుపుపైకి ఎక్కడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

రక్తపు మడుగులో పడి ప్రాణం కోసం ప్రాదేయపడుతున్న ఆయన్ను అటుగా వెళ్తు్న్నవారు ఎవరూ పట్టించుకోలేదు. పైగా, అదంతా వీడియోలు, ఫొటోలు తీస్తూ కాలక్షేపం చేశారు. ఈ ప్రమాదం గురించి కానిస్టేబుళ్లకు తెలియడంతో వెంటనే పోలీస్ వాహనంలోనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన ప్రాణాలు వదిలేశారు. రక్త ఎక్కువగా పోవడం వల్లే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు.

భాస్కర్‌కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. భాస్కర్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.