తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయన్నారు.కేసీఆర్లాంటి సీఎం తమకు కావాలని పక్క రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టమని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.
తెలంగాణ ఏర్పాటైతే చీకట్లేనని కిరణ్కుమార్ రెడ్డి చెప్పారని.. రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కరెంటు కోతల్లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్నారు. కులవృత్తుల కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అధికారంలో ఉన్పప్పుడు రైతుల్నిపట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఆ పార్టీ చేసిన పాపాలు కడిగేందుకు నాలుగేళ్ల సమయం చాలదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికీ ఆ పార్టీ అడ్డుపడుతోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలు కట్టిపెట్టాలన్నారు కేటీఆర్.
తెలంగాణ ఏర్పాటైతే చీకట్లేనని కిరణ్కుమార్ రెడ్డి చెప్పారని.. రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కరెంటు కోతల్లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్నారు. కులవృత్తుల కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అధికారంలో ఉన్పప్పుడు రైతుల్నిపట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు వారిపై కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఆ పార్టీ చేసిన పాపాలు కడిగేందుకు నాలుగేళ్ల సమయం చాలదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికీ ఆ పార్టీ అడ్డుపడుతోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలు కట్టిపెట్టాలన్నారు కేటీఆర్.