యాప్నగరం

ప్రగతి నివేదన సభపై హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సభను ఆపాలంటూ లాయర్, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ వేశారు.

Samayam Telugu 30 Aug 2018, 8:00 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సభను ఆపాలంటూ లాయర్, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ వేశారు. సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం నివేదికను ప్రకటించానుకుంటే టెక్నాలజీ సాయంతో మాధ్యమాల ద్వారా ఆ పనిని చేయొచ్చని పిటిషన్‌లో ప్రస్తావించారు. సభకు అనుమతి ఇవ్వొద్దని కూడా కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం నాడు వాదనలు విననుంది.
Samayam Telugu Trs


ప్రభుత్వం వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేస్తోందన్నారు లాయర్ పూజారి శ్రీధర్. ప్రజలకు నివేదికలు తెలియజేయాలంటే.. ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయని.. అందుకు టెక్నాలజీ కూడా అందుబాటులో ఉందన్నారు. ప్రజలు తమ నిరసనను తెలిపేందుకు ధర్నా చౌక్‌కు వచ్చేందుకే అనుమతించడం లేదని.. కాని ప్రభుత్వం బహిరంగ సభ పెడితే ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అలాగే ఈ సభకు సంబంధించి ప్రచారం కోసం కోట్ల రూపాయల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా చూడాలని.. రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలకు వ్యతిరేకంగా పాలన యంత్రాంగం వ్యవహరించకూడదని పిటిషన్‌లో ప్రస్తావించారు. మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సభలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు.

సెప్టంబర్ 2న ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదిన సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 25లక్షలమంది వస్తారని అంచనా వేస్తోంది. సభకు ఏర్పాట్లు చకా, చకా జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. మరి ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.