యాప్నగరం

పగటి పూటే పని చేయనున్న పెట్రోల్ పంపులు!

మే 15 నుంచి అన్ని బంకులను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తెరచి ఉంచుతామని..

TNN 25 Apr 2017, 9:04 pm
మే 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంపెనీల నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని పెట్రోల్‌ డీలర్ల సమాఖ్య నిర్ణయించింది. అన్ని జిల్లాల సమాఖ్య ప్రతినిధుల సమావేశాన్ని ఇవాళ (ఏప్రిల్ 25) విజయవాడలో నిర్వహించారు. గతేడాది ముంబైలో ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారుల సమక్షంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందినందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా డీలర్ మార్జిన్‌ పెంచుతామని వాగ్దానం చేసినప్పటికీ.. కంపెనీలు అమలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. ఈవిధంగా మొత్తం 11 హామీలపైనా దాటవేత ధోరణి అనుసరిస్తుండటం వల్ల డీలర్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu petrol pumps to run only 6 am 6 pm from may 15
పగటి పూటే పని చేయనున్న పెట్రోల్ పంపులు!


సమాఖ్య అధ్యక్షుడు ఆర్. గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు పాటిస్తాం’ అని తెలిపారు. మే 15 నుంచి అన్ని బంకులను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తెరచి ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.