యాప్నగరం

భార్య పరువు తీసిందని.. పిల్లలతో సహా బలవన్మరణం

కట్టుకున్న భార్య.. కళ్ల ముందే వేరో వ్యక్తితో జీవిస్తుంటే తట్టుకోలేక ఆ భర్త కుమిలిపోయాడు.

TNN 9 May 2017, 2:20 pm
కట్టుకున్న భార్య.. కళ్ల ముందే వేరో వ్యక్తితో జీవిస్తుంటే తట్టుకోలేక ఆ భర్త కుమిలిపోయాడు. సమాజం చూపిస్తున్న సానుభూతిని భరించలేక జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లల్ని చంపి.. తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతి మనసును కలచివేసే ఈ హృదయ విధారక ఘటన కర్నూలు జిల్లాలోని శివరామాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu physically challenged person ends his life himself dramatically
భార్య పరువు తీసిందని.. పిల్లలతో సహా బలవన్మరణం


శివరామాపురానికి చెందిన మహేష్ (29) పుట్టుకతోనే దివ్యాంగుడు. కుల వృత్తి ప్రకారం గ్రామంలో ఓ సెలూన్ నడుపుతున్నాడు. ఏడేళ్ల క్రితం వెంకటలక్ష్మితో మహేష్‌ వివాహం జరిగింది. వీరికి హారిక (5), ఆకాశ్‌ (4) ఇద్దరు పిల్లలు. మహేష్ తన తల్లిదండ్రుల నుంచి వచ్చేసి మూడేళ్ల క్రితం వేరే కాపురం పెట్టాడు. మరోవైపు అదే గ్రామానికి చెందిన సయ్యద్ భాషా అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌తో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది. అతనితో అక్రమ సంబంధం నెరిపింది. ఆరునెలల క్రితం ఏకంగా అతనితో వెళ్లిపోయి సహజీవనం చేస్తోంది.

భార్య పోతేపోయిందని భావించిన మహేష్‌ పిల్లల్ని పోషించుకుంటూనే తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కానీ బయటకు వెళ్లిన ప్రతిసారీ ఎవరో ఒకరు మహేష్‌పై జాలి చూపుతుండటంతో అవమానంగా భావించి తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు. వారంరోజుల క్రితం వెంకటలక్ష్మి తన పిల్లలిద్దరినీ ఇచ్చేయాలంటూ పంచాయతీ చేయడం మహేష్‌ను మరింత కుంగదీసింది. దీంతో సోమవారం మధ్యాహ్నం పిల్లలిద్దరినీ గొంతు నులిమి చంపేసిన మహేష్ తాను చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కర్నూలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.